Showing posts with label bandlamudi. Show all posts
Showing posts with label bandlamudi. Show all posts

Tuesday, April 15, 2014

ఎన్నికల్లో డబ్బు, కులం, మతం చూడొద్దు : ఫ్రత్తిపాటి


ఎన్నికల్లో డబ్బు, కులం, మతం చూడొద్దు. వాటన్నింటికి అతీతంగా వ్యవహరించండి. మీ ఊళ్లో వాళ్లను కూడా చైతన్యపరచండి. అప్పుడే  మీ భవిష్యత్తు బావుంటుంది. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకొంటే నష్టం కలుగుతుందని ఓటర్లకు అవగాహన కలిగించాలని ఫ్రత్తిపాటి అన్నారు.

ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పాల్గొన్నారు. రాధాకాష్ణ మాట్లాడుతూ అభ్యర్థుల కులం, మతం, ప్రాంతం చూడొద్దన్నారు. అభ్యర్థుల గుణం చూసి ఓటేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు నేడు తాడు, బొంగరం లేకుండా చేశారు. ఈ క్లిష్ట సమయంలో జాగ్రత్తగా వ్యవహరించి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. రాజకీయ వ్యవస్థ అంతా కుళ్లిపోయిందన్న భావన నుంచి విద్యార్థులు బయటికి రావాలని, అంతా ప్రభుత్వమే చేయాలన్న ధోరణి సరికాదన్నారు. ఓటు వేయడం ప్రాథమిక బాధ్యత అని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సూచించారు. రాజ్యాంగానికి నేను అతీతుడిని అన్నట్లుగా వ్యవహరించడం వలనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలకు ఆకర్షితులు కావడం వలన నేడు ఇంజనీరింగ్ విద్యలో క్వాలిటీ తగ్గిపోయి పట్టభద్రులకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. దేశంలో న్యాయవ్యవస్థ చురుకుగా ఉండటం వలనే 2జీ లాంటి కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఉన్నంతలో మంచి వాళ్లను ఎన్నుకోవాలన్నారు. నోటా ఓటుకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు.

Monday, April 14, 2014

నందమూరి హరికృష్ణ ఇంట్లో ఆదివారం ఏం జరిగింద?



నందమూరి హరికృష్ణ ఇంట్లో ఆదివారం ఏం జరిగిందనే అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హరికృష్ణ తమ్ముడు బాలకృష్ణకు అనంతపురం జిల్లా హిందూపురం టిక్కెట్టు ఖరారైంది. అయితే హరికృష్ణ తనకు కూడా టిక్కెట్టు కావాలని చంద్రబాబుని కోరారు. అయితే ఈ విషయంపై ఆదివారం హరికృష్ణ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హరికృష్ణతో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ పాల్గొన్నారు. సమావేశంలో ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ ఇద్దరూ చంద్రబాబు, బాలయ్యతో ఫోన్లో చర్చలు జరిపారు. హరికృష్ణకు పెనమలూరు అసెంబ్లీ టిక్కెట్టు ఇస్తే హరికృష్ణను గెలిపించుకునే బాధ్యతతో పాటు ఎన్టీఆర్‌ హిందూపూర్‌లో బాలకృష్ణతో కలిసి ప్రచారం చేయాల్సి ఉంటుంది.
               
అలాగే ఎన్టీఆర్‌ నారా లోకేష్‌తో కలిసి కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలి. ఈ షరతులకు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ అంగీకరించారు. దీంతో హరికృష్ణకు పెనమలూరు సీటు కేటాయించేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఇప్పటి వరకు నందమూరి-నారా కుటుంబాల మధ్య ఉన్న గ్యాప్‌  పూడినట్టు అయ్యింది.

జన్మభూమి రుణం తీర్చుకుంటా: కోడెల


సత్తెనపల్లి: సత్తెనపల్లి నా జన్మస్థలం. నేను కోరుకున్న నరసరావుపేటను కాదనుకుని నన్ను కోరుకున్న సత్తెనపల్లికి రావడం ఎంతో ఆనందంగా ఉందని టీడీపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆదివారం రాత్రి కాకతీయ కల్యాణ మండపంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు యెలినీడి రామస్వామి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ తల్లి ఒడి నుంచి ఈ తల్లి ఒడికి చేరానన్నారు. కార్యకర్తలు చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. రైతు రుణమాఫీ గురించి ప్రజలకు వివరించాలన్నారు. నా మీద అభిమానం చూపిస్తున్న సత్తెనపల్లి ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17వ తేదీన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నిమ్మకాయల రాజనారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కోడెల నాయకత్వం వర్ధిల్లాలంటా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా మండలంలోని గుడిపూడి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కొందరు ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకి సహకరించిన వారు సమావేశానికి వచ్చారని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

తెలుగుదేశం పార్టీకి జనసేన సంఘీభావం

తెలుగుదేశం పార్టీకి జిల్లాలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలియజేస్తోన్నారు. టీడీపీ నాయకులు నిర్వహిస్తోన్న ఎన్నికల ప్రచారాల్లో జనసేన కార్యకర్తలు పార్టీ జెండాలతో వచ్చి మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జిల్లా పర్యటనలో తొలిసారిగా జనసేన శ్రేణులు టీడీపీతో కలిసి ముందుకు నడిచాయి. దీంతో తెలుగుతమ్ముళ్లు ఎన్నికల ప్రచారంతో మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 'కాంగ్రెస్ హఠావో... దేశ్ బచావో' నినాదంతో రాజకీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమ పార్టీ పాల్గొనదని, ఏ ఒక్క రాజకీయ పార్టీ గెలువు అవకాశాలు దెబ్బతీయ దలుచుకోలేదని స్పష్టం చేశారు. అలానే బీజేపీకి, ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీకి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య జిల్లాలో చెలిమికి బీజం పడింది. టీడీపీకి సంఘీభావంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఇప్పటికే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ శ్రేణులను ఆదేశించారు. దీంతో జనసేన కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో బైకు ర్యాలీలు, పాదయాత్రలతో హల్‌చల్ చేస్తూ టీడీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.
యువతలో పవన్ కల్యాణ్‌కు మంచి క్రేజ్ ఉన్నది. గతంలో పవన్ జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో యువత విశేషంగా స్పందించింది. ఆయన యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసింది. జిల్లాలోని అన్ని పట్టణాలతో పాటు మండలాల్లోనూ పవన్ కల్యాణ్ అభిమాన సంఘాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఆయా సంఘాల్లోని పవన్ అభిమానులంతా క్రమంగా తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. పవన్ అభిమానుల మద్దతు వలన తమకు ఓటింగ్ శాతం మరింత పెరిగిందని టీడీపీ జిల్లా నాయకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే బీజేపీకి మద్దతుగా ఇప్పటికే పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన త్వరలో జిల్లాకు కూడా వస్తారని రెండు పార్టీల నాయకులు భావిస్తున్నారు. టీడీపీ ప్రజాగర్జన జిల్లాలో ఇప్పటివరకు జరగలేదు. ఇతర జిల్లాలను తలదన్నే రీతిలో లక్షల మంది ప్రజలతో సభను నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల టిక్కెట్ల ఖరారు పూర్తి అయి నామినేషన్ల ప్రక్రియ ముగియగానే గర్జన తేదీని నిర్ణయించాలని నాయకులు భావిస్తున్నారు. ఆ సభకు పవన్ కల్యాణ్‌ను కూడా తీసుకురావాలని యోచిస్తున్నారు.

TDP clears Nani’s name for Vijayawada LS



Nani ‘rattled’ by reports that Pawan Kalyan proposed P. Varaprasad's name. Meanwhile, discontent continued in the TDP rank and file over allocation of some important seats to the BJP as part of the alliance.

The Telugu Desam Party has finally cleared the candidature of Kesineni Srinivas alias Nani from the Vijayawada Lok Sabha constituency.
The decision came after Mr. Nani called on TDP president N. Chandrababu Naidu at his residence on Monday morning. Though what transpired in the meeting was not known yet, the TDP president is learnt to have assured Mr. Nani that he was the party’s choice from the prestigious constituency.
Mr. Nani had been nurturing the constituency for some time now after receiving an assurance from the party leadership, but doubts were expressed on whether he would be allotted the ticket. Mr. Nani was reportedly unnerved by claims of a section of leaders that film star and Jana Sena Party founder Pawan Kalyan had strongly recommended the name of his close confidant Potluri Varaprasad to the TDP leadership.
A formal announcement of Mr. Nani’s candidature will be made in the next list likely to be released by the TDP leadership on Monday midnight or early Tuesday. “His (Mr. Nani’s) name has been finalised and we will officially announce it any moment from now,” a senior leader engaged in the screening exercise told The Hindu.
Protests continue

Meanwhile, discontent continued in the TDP rank and file over allocation of some important seats to the BJP as part of the alliance. A section of the TDP cadre damaged furniture in the party office in the Vijayawada West constituency in protest against allotting the seat to the BJP while their counterparts in Nellore staged protest against the decision to give Nellore Rural seat to the saffron party.
TDP activists ransacked the party’s office at Kaikalur in Krishna district for giving away the seat, a stronghold of the party, to the BJP. They disrupted a meeting of the important leaders of the constituency demanding re-nomination of Jayamangala Venkataramana who won from the seat in the previous elections.

పవన్‌కళ్యాణ్‌ అకౌంట్‌లో కట్‌

నసేన పార్టీ స్థాపించిన పవన్‌కళ్యాణ్‌ ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, తన అభ్యర్థుల్ని ఎవర్నీ కూడా నిలబెట్టడం లేదని స్పష్టం చేసేశాడు. అయితే ఈ పార్టీ తరఫున పొట్లూరి వరప్రసాద్‌ పోటీ చేస్తాడని, ఒకవేళ జనసేనలో కాకున్నా అతనికి టీడీపీ లేదా బిజెపీలో టికెట్‌ వచ్చేట్టు పవన్‌ చూస్తాడని ఊహాగానాలు సాగాయి. జనసేన ఆవిర్భావ సభకి, వైజాగ్‌ బహిరంగ సభకి అయిన ఖర్చులు మొత్తం అతనే భరించాడని కూడా అన్నారు. అయితే పివిపి పెట్టిన డబ్బులన్నీ కూడా పవన్‌తో అతను నిర్మించబోయే సినిమాకి ఇచ్చే రెమ్యూనరేషన్‌ నుంచి కట్‌ చేసుకుంటాడట. 

ఇప్పటికే పార్టీ కోసం సొంత డబ్బు చాలా వరకు ఖర్చు పెట్టిన పవన్‌కళ్యాణ్‌కి ఇప్పుడు ఈ సభలతో భారీగానే అప్పు పడ్డాడు. ఇకపోతే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కాబట్టి ఇక షూటింగ్స్‌కి వెంటనే వచ్చేస్తాడని అనుకుంటూ ఉంటే ఇప్పట్లో షూటింగ్స్‌కి రానని పవన్‌ తేల్చేసాడట. మరో ఏడు సభలు నిర్వహించి జనాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేస్తాడట. ఎన్నికలు అయ్యాక కూడా పవన్‌ సభలు కొనసాగుతాయట. వచ్చే ఎన్నికలని దృష్టిలో ఉంచుకుని పవన్‌ ఈ ప్రణాళిక వేసుకున్నాడని భోగట్టా.

వారసుడికి ఇక అడ్డు లేదు

మామ ఎన్టీఆర్ నుంచి పార్టీని, అధికారాన్నయితే సంపాదించుకున్నారు కాని ఆయన వారసులు అంటూ నందమూరి కుటుంబం బెడదను మాత్రం నారా వారు ఇప్పటి వరకు తప్పించుకోలేకపోయారు. ఇక తన రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే సమయం దగ్గరపడనున్న నేపథ్యంలో తన వారసునికి నందమూరి కుటుంబం నుంచి బెడద లేకుండా శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. చంద్రబాబు అంటే రాజకీయాల్లో ఆరి తేరినవారు. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలరు. కాని తన వారసుడు లోకేష్ కు అంత చతురత వుంటుందా? వుండదా అన్నది అనుమానం. అందుకే తను ఉన్నప్పుడే లోకేష్ కు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పనులు చంద్రబాబు చక్క దిద్దుతున్నారు.

తెలుగుదేశం తన చేతిలోకి వచ్చిందే కాని ఇప్పటి వరకు నందమూరి వారసత్వం నుంచి చిక్కులు తప్పలేదు. ఎన్టీఆర్ పేరును వాడుకోవడం తప్పనిసరి. అది వాడుకోవాలంటే ఆయన వారసులను ఉంచుకోవడం కూడా కంపల్సరీ. దీంతో చంద్రబాబు తొలుత హరికృష్ణను దగ్గర తీసుకున్నారు. హరికృష్ణ రాజకీయ దురంధరుడు కాకపోయినా కూడా తండ్రి పేరు చెప్పుకుని చంద్రబాబును ఎన్ని ఇబ్బందులకు గురిచేసారో అందరికి తెలిసిందే.

చివరకు ఎన్టీఆర్ పోలికలతో కుమారుడు జూనియర్ తయారుకావడంతో హరికృష్ణ చంద్రబాబును ఓ ఆటాడుకోవడం మొదలెట్టారు. ఈ మద్య అటు తండ్రిని, ఇటు కొడుకుని అడ్డంపెట్టుకుని చంద్రబాబును ఏకంగా ఏదో చేయాలనే భావనలోకి హరికృష్ణ వచ్చారు. పదవికి రాజీనామా, ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లేందుకు రథయాత్ర వంటి స్కెచ్ లు వేసుకున్నారు. చంద్రబాబు కాబట్టి ఎలాగోలా నిలువరించారు.
జూనియర్ ను ఓ దశలో జగన్ కు దగ్గరగా చేస్తున్నాన్న రేంజ్ లో హరికృష్ణ చంద్రబాబుకు డేంజర్ సిగ్నల్స్ కూడా పంపారు. ప్లెక్సీలు, బొమ్మలు బాగోతం అందులో భాగమే.  ఇవన్నీ చంద్రబాబును రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాయో అందరికి తెలిసిందే.

అయితే ఇక చంద్రబాబుకు కాలం కలసి వచ్చిందో, ఆయన తెలివితేటలు సహకరించాయో తెలియదు కాని నందమూరి బెడద ఇక పూర్తిగా తొలగిపోయే క్షణాలు వచ్చేసాయి. హరికృష్ణ టిడిపిలోనే ఉంటూ చికాకు పెడుతుండగా, ఎన్టీఆర్ కూతురు పురంధరీశ్వరి కాంగ్రెస్ లో ఉండి కొరకురాని కొయ్యగా తయారయింది. ఎన్నటికైనా చంద్రబాబుకు పురంధరీశ్వరి నుంచి రాజకీయ ముప్పు ఉందనే భావం ఇప్పటివరకు ఉంది.

ఇక ఆ భాద తొలగినట్టే. విభజన పుణ్యమా అని పురందరీశ్వరికి రాజకీయ జీవితాన్నిస్తున్న కాంగ్రెస్ ఖతం అయింది. దీంతో ఆమె  తన భవిష్యత్తు కోసం బిజేపిలో చేరారు. ఇది చంద్రబాబుకు మరింత ఇబ్బంది పెడుతుందని భావించారు. కారణం బిజేపితో పొత్తు పెట్టుకున్నందున పురంధరీశ్వరిని ఇక ఏమి అనలేక భరించాల్సి వస్తుంది అనుకున్నారు. కాని ఆమె విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన ఆమె గెలిచే అవకాశాలు అంతో ఇంతో ఉన్న విశాఖ లోక్ సభ స్థానం ఆమెకు దక్కకుండా పోయింది. అసెంబ్లీ కి ఆమె పోటీ చేయదు, చేసినా గెలిచే అవకాశాలు తక్కువ అంటున్నారు. అంటే స్ట్రాంగ్ గా ఉన్న నందమూరి వారసత్వం ఒకటి రాజకీయాలకు దూరం అయినట్టే అంటున్నారు.

ఇక మిగిలింది హరికృష్ణ , ఆయనకు చంద్రబాబుకు ఎదురొడ్డి ఏదో చేసే సత్తా లేదు. కొడుకు జూనియర్ ను అడ్డంపెట్టుకునే ఏదైనా చేయాలి. కాని జూనియర్ ను చంద్రబాబు పక్కా పథకం ప్రకారం పక్కను నెట్టారు. ఆయన ఇప్పుడు రాజకీయాల మాటే ఎత్తడం లేదు. ఓ వేళ మాట్లాడిని టిడిపికే నామద్దతు అనడం తప్ప మరో మాట అనకుండా చేసారు. హరికృష్ణ చంద్రబాబును కాదని చేసిన వ్యవహారం అంతా చూసారు కాబట్టి ఈ సారి ఆయనకు టికెట్ ఇవ్వకున్నా చంద్రబాబును తప్పుగా భావించే పరిస్థితి లేదు.

అందుకే ఆయనకు టికెట్టు రాలేదు. చివరిదాకా ఇస్తున్నట్టే భ్రమలో ఉంచి చివరకు ఇవ్వకుండా మొండి చేయి చూపారు. వియ్యంకుడు నందమూరి వారసుడు బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారుగా. నందమూరి బెడద ఎలా తప్పుతుంది అనుకోవచ్చు. నిజానికి బాలకృష్ణకు రాజకీయ చతురత, ఎదిగే లక్షణాలు లేవు. ఆవేశం అంతంత మాత్రం. పైగా అన్నింటికన్నా ఆయన లోకేష్ కు మామగారు. అందువల్ల బాలకృష్ణలో లోకేష్ కు వచ్చిన ఇబ్బందులు లేవు. బాలకృష్ణ గెలిచారే అనుకుందాం, ఆయనకు పెద్ద పదవి కూడా ఇచ్చారే అనుకుందాం. కాని తన కూతురునే కొడుకుకు ఇచ్చారు. అలాంటప్పుడు అల్లునికి అండగా ఉంటారు తప్ప ఎదురు తిరగే ప్రయత్నం చేయరు గాక చేయరు. మరి ఇక వారసుడికి అడ్డేముంది? - See more at: http://telugu.gulte.com/tnews/4206/Chandrababu-make-free-path-lokesh#sthash.22o7culF.dpuf

YS Jagan needs to understand Statistics

The YSR Congress Party leader Y S Jagan Mohan Reddy who came out with their Manifesto yesterday went off on a tirade against TDP leader by saying that development was better during the YSR regime. Talking about statistics he said that it was in his father’s time that AP had seen a surge of development in the field of IT , but for the fact that it was during Naidu’s time the whole concept of IT was developed and implemented. The number of jobs generated in the IT field were more than Naidu’s time.

But if the promotion of the field of IT was spearheaded by Mr. Naidu than how can the Congress take credit for it. When the TDP was in power between 1994 and 2004 and YSR regime which was only between 2004 and 2009 - these figures cannot be compared as the development phase had started then and if we remember correctly India witnessed the Great Recession phase where many people lost their jobs and would Y S Jagan be willing to give the credit to his father for that?


Check out the brief highlights of the YSRCP Manifesto which was the last to come out.Nothing new in regards to development of the State has been given.
Pension to be Rs.700 per month.


Special centres in every village to give the people any type of identity card within 24 hours. About ten local women will do the duties in the centre ‘Amma Vodi’ Pathakam for poor people. As per the program, Rs.500 will be deposited in the bank account of mother every month. If a family consists of two children, the amount will be Rs.1000.


Natural calamities fund will be established with a fund of Rs.2,000 crores. Farmers will be given immediate relief under the scheme.

Agricultural colleges in two districts. Three agricultural and veterinary universities will be established in the state. Complete Fee reimbursement.

102 mobile team service at every mandal headquarter in the state. Farmers will get the service within 20 minutes of making a call. 103 mobile team service in every mandal headquarter in the state for veterinary services.

Loan waiver of DWACRA ladies to the tune of Rs.20,000 crores. Changes will be done in the loan policy of DWACRA women.About two lakh women in 20,000 villages will get the employment.

Power cut- free state by 2019. Seven hours of compulsory power for farmers daily.

Orphanage in every assembly constituency.

No belt shops in villages.Super specialty hospitals in every district.Liquor sale only at one place in a constituency.

50 lakh houses to be constructed  within next five years. A house for every person.  

Complete changes will be made in Arogyasri scheme. Rs.3,000 pm will be provided to every person, who got operated, till he is in a position to go to work
 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020