Tuesday, July 12, 2016

పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం : ఎన్టీఆర్



పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టని అనేవారు ఎన్టీఆర్. పేదలకు ఆహారభద్రత కల్పించలేని నాడు మనం ఏం పాలించినట్టు? ఏం సాధించినట్టు?.. అంటూ అధికారులతో ఆవేశంగా అనేవారాయన. అలా అన్నట్టే ఆయన పథకాలన్నీ పేదల చుట్టూనే తిరిగాయి. ఆయన ఆదర్శాన్ని, ఆవేశాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళంతా, వాటిని కేవలం జనాకర్షణ పథకాలుగా పేర్కొనేవారు. ఎవరెన్ని, ఏ విధంగా అనుకున్నా లెక్కచేసేవారుకాదు ఎన్టీఆర్. ఆయనకు తెలుసు ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారో. ప్రజలకు తెలుసు ఆయన ఎంత నిజాయితీతో చేస్తున్నారో. ఈ పరస్పర నమ్మకమే ఎన్టీఆర్ ను ప్రజానాయకుడిగా చిరస్మరణీయుడిని చేసింది.

CBN meets Russian Prime Minister Mr. Dmitry Medvedev


CBN met Mr. Dmitry Medvedev, Prime Minister of Russia at the VII International Industrial Exhibition Innoprom 2016 in the Urals city of Yekaterinburg. CBN said that India and Russia are natural and traditional friends who stood by each other for decades. Observing that Russia has strong roots in manufacturing, technology and natural resources he said AP is leading in innovation, IT and in adapting best practices from across...
See more
1.5k
1

CBN met Mr. Boris Dubrovsky, the Governor of the Chelyabinsk Region

Telugu Desam Party (TDP)'s photo.
Sri NCBN met Mr. Boris Dubrovsky, the Governor of the Chelyabinsk Region at the Innoprom 2016 in the Urals city of Yekaterinburg. Sri NCBN called for close cooperation between Andhra Pradesh and Chelyabinsk and requested the Governor to consider the state’s investment potential.

Sunday, July 10, 2016

సమగ్రంగా.. ఆచితూచి!

  • పక్కా సమాచార సేకరణకు సర్వేలో పెద్దపీట 
  •  సీఎంవో కార్యాలయం నిరంతర పర్యవేక్షణ 
  •  సర్వేపై అపోహలు వద్దు: సునీత, పల్లె
ప్రజాసాధికార సర్వేలో పొరపాట్లకు తావులేకుండా సమగ్రంగా నిర్వహించేందుకు అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో 7334 కుటుంబాలకు చెందిన 17,178 మంది నుంచి సమాచారాన్ని సేకరించారు. సర్వే వివరాలు మొత్తం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుండటం.. ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసేందుకు ప్రాధాన్యమిస్తుండటంతో తొలి రెండు రోజులు సర్వే కొంత నెమ్మదిగా సాగినట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి సర్వే వేగాన్ని పెంచడంపై దృష్టి సారిస్తామని అంటున్నారు. సర్వే జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే వివరాలు ఎప్పటికప్పుడు సీఎంవోకు చేరేలా ఏర్పాటు చేశారు. సర్వే తీరుతెన్నులను ఐటీ శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాగా.. సర్వేపై అపోహలు, సందేహాలు వద్దని ప్రజలకు మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న వారు సర్వేపై విలేకరులతో మాట్లాడారు. సర్వేకు ప్రజలందరూ సహకరించి, సమగ్రమైన వాస్తవ వివరాలు అందజేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను మరింత సమర్థంగా అందించేందుకే సర్వే చేపడుతున్నామన్నారు.

12 గ్రామాల లేఅవుట్లు పూర్తి

  • మరో 7 గ్రామాల లేఅవుట్ల రూపకల్పనపై కసరత్తు 
  •  ఆగస్టు మొదటి వారానికి పూర్తి చేసేలా ప్రణాళిక 
  •  లోపరహితంగా చేపట్టేందుకు చర్యలు 
ఆంధ్రజ్యోతి, అమరావతి : నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపులకు సంబంధించిన పనులను సీఆర్డీఏ అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు విడతల వారీగా చేపట్టనున్న ప్లాట్ల కేటాయింపు ప్రక్రియపై సీఆర్డీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశిత గుడువు నాటికి లేఅవుట్‌తో సహా సాంకేతిక ఇబ్బందులు లేకుండా చేయనున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని 12 గ్రామాల లేఅవుట్ల రూపకల్పన పూర్తయిందని సమాచారం. మరో 7 గ్రామాలకు చెందిన లేఅవుట్లపై సీఆర్డీఏ ప్లానింగ్‌ విభాగం అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. నేలపాడు గ్రామానికి చెందిన ప్లాట్ల కేటాయింపులను పూర్తి చేసిన మాదిరిగానే మిగిలిన గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపులను చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 15 నుంచి విడతల వారీగా అన్ని రాజధాని గ్రామాల ప్లాట్ల రూపకల్పన లేఅవుట్లను ప్రకటించి కంప్యూటర్‌ ద్వారా నిర్వహించే లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక వైపు ప్లానింగ్‌ అధికారులు లేఅవుట్ల పై కసరత్తు చేస్తుంటే మరో వైపు విడతల వారీగా పూర్తిచేయాల్సిన పనులపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. ఈ లాటరీ కేటాయింపులను మూడు వారాల వ్యవధిలో పూర్తి చేసి భూములిచ్చిన రైతులకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని లోపరహిరతంగా పూర్తి చేయడానికి సీఆర్డీఏలోని పలు విభాగాల అధికారులు సునిశిత పరిశీలన అనంతరం చర్యలు తీసుకుంటున్నారు.

చంద్రబాబు బృందానికి కజకిస్థాన్‌ రాయబారి అల్పాహార విందు

ఆస్తానా: రష్యా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం రెండో రోజు ఆదివారం కజకిస్తాన్‌ రాజధాని అస్తానా నగరంలో పర్యటిస్తోంది. ఈ సందర్బంగా సీఎం బృందానికి కజకిస్థాన్ రాయబారి ఆదివారం ఉదయం అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అస్తానాల మధ్య పరస్పర సహకారాన్ని ఆశిస్తున్నామని చంద్రబాబాబు బృందంతో కజకిస్థాన్ రాయబారి అన్నారు. అలాగే ప్రసిద్ధ బేతెరెక్ టవర్‌ను చంద్రబాబు బృందం సందర్శించింది. టవర్ నుంచి ముఖ్య రాజధాని ప్రాంతాన్ని బృందం పరిశీలించి...దాని పైనుంచి నగరాన్ని వీక్షించారు. 1997లో అస్తానాను రాజధానిగా ప్రకటించినందుకు స్మృతిగా 97 మీటర్ల ఎత్తులో బేతెరెక్ టవర్‌ను నిర్మించారు.
 
అనంతరం ఆస్తానా నగర మేయర్‌ అసెట్‌ ఇస్సెకేషెవ్‌తో చంద్రబాబు బృందం భేటీ అయింది. అమరావతి నిర్మాణంలో అస్తానాతో కలిసి పనిచేయలనుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. ఒకసారి అమరావతిని సందర్శించాలని మేయర్‌ను ఆహ్వానించారు. అస్తానా సహకారం పై ఓ రోడ్ మ్యాప్ రూపొందించుకుందామని చంద్రబాబు కోరారు. దీనిపై స్పందించిన అస్తానా మేయర్ అమరావతి అభివృద్ధి కి మా సహకారం తప్పకుండా ఉంటుందని చంద్రబాబుతో అన్నారు. భారత రాజకీయాల్లో మీ (చంద్రబాబు) క్రియాశీల పాత్ర గురించి తమకు తెలుసునని మేయర్ వ్యాఖ్యానించారు. ఐటీ, సాంకేతిక రంగాల్లో బాబు చూపిన చొరవ గురించి తెలుసునని, ఏపీతో సంబంధాలు నెరపాలని భావిస్తున్నామని, మన మైత్రి ఉభయ తారకంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
ఏపీ నుంచి వచ్చే పెట్టుబడిదారులకు అస్తానాలో అవకాశాలు ఉన్నాయని, తమ రవాణా శాఖ మంత్రితో మాట్లాడి అస్తానా నుంచి అమరావతికి నేరుగా విమాన సర్వీస్ నడిపేందుకు ప్రయత్నిస్తానని మేయర్‌ అసెట్‌ ఇస్సెకేషెవ్‌ చంద్రబాబుకు హామీ ఇచ్చారు. దీంతో ఇరు ప్రాంతాల మధ్య పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని మేయర్ అభిప్రాయపడ్డారు. ఏపీ నుంచి ఐదుగురు, అస్తానా నుంచి ఐదుగురు సభ్యులతో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామని, రెండ్రోజుల్లో అస్తానా టీమ్ ను నామినెట్ చేస్తామని మేయర్ పేర్కొన్నారు. అస్తానా నిర్మాణంలో పాలు పంచుకున్న రూపశిల్పులు, నిర్మాణదారుల వివరాలు, వారి నిర్మాణ అనుభవాలు తెలపాలని చంద్రబాబు మేయర్‌ను కోరారు. అస్తానా నగర నిర్మాణంలో మొత్తం పదేళ్లలో 150 మంది ఆర్కిటెక్టులు పాల్గొన్నారని మేయర్ తెలిపారు. పరస్పర సహకారానికి అస్తానా-ఏపీ మధ్య త్వరలో ఎంవోయూ కుదిరే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. తర్వాత అక్కడి నుంచి చంద్రబాబు బృందం రష్యాలోని ఎకటెరిన్‌బర్గ్‌ బయలుదేరింది. అక్కడ విదేశీ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికత్తేలతో ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొంటారు.

ref:http://www.andhrajyothy.com/artical?SID=264365

హెచ్‌-1బి వీసా ఎత్తేస్తారా?

  • అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు
  • ఆమోదం పొందితే భారత ఐటికి చావుదెబ్బ్ట


వాషింగ్టన్‌ : అమెరికాలో మళ్లీ హెచ్‌-1బి, ఎల్‌-1 వీసాల గొడవ ప్రారంభమైంది. స్థానికుల ఉద్యోగ అవకాశాలు దెబ్బతీస్తున్న ఈ వీసాలను రద్దు చేయాలని అమెరికా కాంగ్రెస్‌లోని దిగువ సభ... ప్రతినిధుల సభలో ఇద్దరు సభ్యులు ఒక బిల్లు ప్రవేశ పెట్టారు. రిపబ్లికన్‌ పార్టీ సభ్యుడు డానా రొహ్రబాచర్‌, డెమొక్రటిక్‌ పార్టీ సభ్యుడు బిల్‌ పాస్కరెల్‌ ఈ బిల్లు ప్రవేశ పెట్టారు. వీరిద్దరూ భారతీయులు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియా, న్యూజెర్సీ రాష్ట్రాల నుంచే ఎన్నికయ్యారు. ‘ద హెచ్‌-1బి, ఎల్‌-1 వీసాల సంస్కరణల చట్టం, 2016’ పేరుతో ఈ బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టారు. యాభై మంది కంటే ఎక్కువ ఉద్యోగులుండి, అందులో సగానికిపైగా హెచ్‌-1బి, ఎల్‌-1 వీసాలపై పని చేస్తున్న కంపెనీలు, ఇక అలాంటి వీసాలపై విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకోకుండా నిషేధించాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ ఇద్దరు 2010లో కూడా ఇలాంటి బిల్లునే ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. సరైన మద్దతు లేకపోవడంతో అప్పట్లో ఆ బిల్లు వీగి పోయింది. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో వీరు మళ్లీ ఈ బిల్లును కొత్తగా ప్రవేశ పెట్టడం విశేషం.
 
 ‘అమెరికా అత్యంత నిపుణులైన ఉన్నత విద్యావంతులను, హైటెక్‌ వృత్తి నిపుణులను సృష్టిస్తున్నా వారికి ఉద్యోగాలు లేవు. కొన్ని కంపెనీలు వీసాల దుర్వినియోగం ద్వారా విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకుంటూ వారిని దోచుకుంటున్నాయి. దీంతో మన ఉద్యోగులూ ప్రయోజనం పొందలేక పోతున్నారు’ అని పాస్కరెల్‌ అన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ బిల్లులో పేర్కొన్న విధంగా, హెచ్‌-1బి, ఎల్‌-1 వీసాల విధానాన్ని సమూలంగా సంస్కరించాలని కోరారు. లేకపోతే కంపెనీలు స్థానికులను కాదని, తక్కువ జీతాలకు వచ్చే విదేశీయులను మరింత ఎక్కువగా ఉద్యోగాల్లో నియమించుకుని వారి శ్రమను దోచుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ రెండు విషయాలు తమకు ఏ మాత్రం ఆమోద యోగ్యం కావన్నారు. ఈ బిల్లును ప్రతినిధుల సభతో పాటు ఎగువ సభ సెనెట్‌ ఆమోదం పొంది, అమెరికా అధ్యక్షుడి ఆమోదానికి వెళ్లాలి. అధ్యక్షుడు కూడా ఆమోదం తెలిపితే చట్టంగా అమలులోకి వస్తుంది. అమెరికా కార్మిక సంఘాలు సైతం ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి.
 
భారత ఐటి కంపెనీలకు దెబ్బ
ప్రస్తుతం భారత ఐటి కంపెనీలే ఈ వీసాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి. కొత్త బిల్లు చట్టమైతే ఎక్కువగా నష్టపోయేదీ ఈ కంపెనీలే. ప్రస్తుతం భారత ఐటి ఎగుమతుల ఆదాయంలో అమెరికా వాటా 60 శాతం వరకు ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే భారత్ కు చెందిన పలు ఐటి కంపెనీల రాబడులకు కోత పడే ప్రమాదం ఉంది. ఈ కంపెనీలు ఎక్కువగా హెచ్‌-1బి, ఎల్‌-1 వీసాలపై తమ ఉద్యోగులను అమెరికా పంపించి, అక్కడి కంపెనీలకు ఐటి సేవలు అందిస్తున్నాయి. ఇపుడు ఈ కొత్త బిల్లు ఆమోదం పొందితే యాభై మందికి మించి ఉద్యోగులున్న అమెరికా కంపెనీలేవీ ఈ రెండు వీసాలపై వచ్చే భారతీయులతో సహా విదేశీయులెవరినీ ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశం ఉండదు. అదే జరిగితే అమెరికా వెళ్లి డాలర్ల కొలువుల్లో చేరాలన్న మన ఐటి నిపుణుల ఆశలకూ గండి పడనుంది. 
 
ఇప్పటికే అనేక ఆంక్షలు
పొమ్మనలేక పొగ పెట్టినట్టు అమెరికా ఇప్పటికే అనేక రకాలుగా భారత ఐటి కంపెనీల ఆదాయాలకు గండి కొడుతోంది. ఇందులో భాగంగా గత సంవత్సరం ఈ రెండు వీసాల ఫీజు గణనీయంగా పెంచింది. ప్రస్తుతం ఒక్కో హెచ్‌-1బి వీసా కోసం 4,000 డాలర్లు (సుమారు రూ.2.69 లక్షలు), ఎల్‌-1 వీసా కోసం 4,500 డాలర్లు (సుమారు రూ.3.02 లక్షలు) చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఈ వీసాల కోసం భారత ఐటి కంపెనీలు ఏటా చెల్లించే పీజుల భారం 10 కోట్ల డాలర్ల నుంచి 40 కోట్ల డాలర్లకు పెరిగింది. ప్రధాని మోదీతో సహా భారత ప్రభుత్వ పెద్దలు అనేక సార్లు ఈ విషయాన్ని ఒబామా సర్కార్‌ దృష్టికి తెచ్చినా, ఫలితం శూన్యం. దీంతో అమెరికా చర్య విచక్షణా పూరితంగా ఉందని భారత.. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ)కు ఫిర్యాదు చేసింది.
 
ఏంటీ వీసాలు..
హెచ్‌-1 బి వీసా: ప్రత్యేక వృత్తుల్లో ప్రత్యేక నైపుణ్యం ఉన్న విదేశీయులు తాత్కాలికంగా అమెరికాలో ఉద్యోగం చేసేందుకు ఈ వీసా ఇస్తారు. ఈ వీసా ఉన్న విదేశీయులను అమెరికా కంపెనీలు ఉద్యోగాల్లో చేర్చుకోవచ్చు. 
ఎల్‌-1 వీసా: అమెరికాతో పాటు, విదేశాల్లో కార్యాలయాలున్న అంతర్జాతీయ కంపెనీల ఉద్యోగులకు ఈ వీసాలను జారీ చేస్తారు


ref: http://www.andhrajyothy.com/artical?SID=264139

గడపగడపలో వైసీపీని తరమికొడుతున్నారు: జూపూడి

విజయవాడ: పభుత్వంపై అబద్ధాలు చెబుతూ గడప గడపకు వస్తున్న వైసీపీ నాయకులను, ప్రజలు తరిమి కొడుతున్నారని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌రావు ఎద్దేవా చేశారు.  రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని చూసి ఏమిచేయాలో పాలుపోక వైసీపీ నేతలు గడపగడపకు అబద్ధాలు చెప్పుకుం టూ తిరుగుతున్నారన్నాని ఆరోపించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.1101 కోట్లతో ఎస్సీ కార్పొరేషన్‌ ఓ యాక్షన్‌ ప్లాన్ తయారు చేసిందన్నారు.

Saturday, July 9, 2016

 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020