తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుందని, తెలంగాణ ఇచ్చింది...తెచ్చింది కాంగ్రెస్సే అని ఎంపీ రాజయ్య అన్నారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ది అధికార దాహమని, కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంలో స్వపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించామని, మమ్మల్ని ద్రోహులనడం సరికాదన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ కాంగ్రెస్తోనే సాధ్యమని ఎంపీ రాజయ్య స్పష్టం చేశారు. అధికార దాహంతోనే కాంగ్రెస్ను కేసీఆర్ కాదనుకున్నారని మరో ఎంపీ గుత్తా సుఖేందర్ ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ సెగ్మెంట్లలో అమరవీరుల కుటుంబాలకు ఎందుకు టిక్కెట్లు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.
No comments:
Post a Comment